Thursday, 12 May 2016

chaaya event2

Chayya 2nd event details[5 July 2015]
 "ఛాయ" రెండవ సమావేశం [ 28 జూన్ 2015] లొ...
అంబటి సురేంద్రరాజు[అ.సు.ర] గారు, సురవరం ప్రతాపరెడ్డి గారి "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" పై ప్రసంగించారు.
Thanks to అంబటి సురేంద్రరాజు[అ.సు.ర] గారు  for being our guest speaker.

"ఛాయ" రెండవ సమావేశ విశెషాలు[5 July 2015]:
----------------------------------------------------------
1.శివాజి గారు "ఛాయ" లక్ష్యాలను తెలిపారు.
2.ఇటీవల మనకు దూరమైన మహొపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి 2 నిమిషాలు నివాళి అర్పించారు.
3.సురవరం ప్రతాపరెడ్డి గారి "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" పై, అంబటి
సురేంద్రరాజు[అ.సు.ర] గారి ప్రసంగ సారాంశం క్లుప్తంగా:
ఈ గ్రంధములొ సురవరం ప్రతాపరెడ్డి గారు , 1050 సంవత్సరం అనగా తూర్పు
చాళుక్య యుగము నుండి 1907 సంవత్సరం వరకు..తెలుగు ప్రజల జీవన విధానములొ సంభవించ్జిన మార్పులు, ఉత్తాన పతనములను గూర్చి వివరించారు. కాకతీయుల యుగము , రెడ్డి రాజుల కాలము , విజయనగర సామ్రాజ్య కాలము లలొ జీవించిన తెలుగు వారి జీవనంలొ సంభవించిన యుధ్హాలు, విజయాలు, ఓటముల గురించి వివరించారు. వీటితొపాటు ఆయా కాలల్లొ తెలుగు ప్రజల పండగలు, పిల్లల ఆటలు, ఆచార వ్యవహరాలు, దండనలు, కుల మత విశెషాలు వివరించారు. శైవుల చేతిలొ జైనులు ఎలా శిక్షలకు గురయ్యారొ తెలిపారు.వెయ్యి సంవత్సరాల క్రితమే వరంగల్ లొ 1500 చిత్రకళా కుటుంబాలు వుండేవన్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారి "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" తర్వాత సాంఘిక చరిత్రను ఏ విశ్వవిధ్యాలయము, చరిత్ర విభాగము రికార్డ్ చెయలెదన్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు నుండి 2015 వరకు మన సాంఘిక చరిత్రను ఎవరైన రికార్డ్ చేస్తె చాలా గొప్ప పని అవుతుందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి గారు ఆనాటి కవులు రాసిన ప్రజా కావ్యాలను, ద్విపదలలొ రాసిన కావ్యాలను పరిగణలొకి తీసుకొని "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" అనే బ్రుహత్ గ్రంధాన్ని రచించారన్నారు. వెయ్యెళ్ళ తెలుగు వాడి ప్రస్థానాన్ని "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" లొ చూడవచ్చన్నారు. ప్రసంగానంతరం ప్రేక్షకుల సందేహాలను తీర్చారు.
4. క్రిష్ణ మొహన్ బాబు , ఛాయ రెండవ సమావేశం విజయవంతం చెసిన సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.







No comments:

Post a Comment